ఒక్కరోజే కరోనా 985 పాజిటివ్ కేసులు…

187
coronavirus
- Advertisement -

తెలంగాణలో గత 24 గంటల్లో 985 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఏడుగురు మృత్యువాత పడ్డారు. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 774 ఉండగా హైదరాబాద్‌ ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌డివిజన్‌లో శుక్రవారం ఒక్కరోజే 177 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆసిఫ్‌నగర్‌ ఠాణాలో ఓ హెడ్‌కానిస్టేబుల్‌కు కూడా వైరస్‌ సోకింది. దీంతో ఇప్పటివరకు ఈ పోలీస్‌స్టేషన్‌లో కేసుల సంఖ్య 19కి చేరింది.

రంగారెడ్డి జిల్లాలో 86, మేడ్చల్‌-53, వరంగల్‌ అర్బన్‌-20, మెదక్‌-9, ఆదిలాబాద్‌-7, నాగర్‌కర్నూల్‌, నిజామాబాద్‌, రాజన్నసిరిసిల్ల-6 చొప్పున, సిద్దిపేట, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం-3 చొప్పున, ములుగు, జగిత్యాల, యాదాద్రిభువనగిరి-2 చొప్పున, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల్లో-1 చొప్పున కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 75,308 పరీక్షలు చేయగా, 12,349 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మొత్తం 237 మంది మరణించారు.

- Advertisement -