రాష్ట్రంలో తగ్గిన కరోనా కేసులు…

163
coronavirus
- Advertisement -

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 189 కొత్త పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇద్దరు కరోనాతో మృతిచెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,342కు చేరాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 1780 యాక్టివ్ కేసులుండగా 2,96,916 మంది కరోనా నుండి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 1646 మంది మృతిచెందారు.. దేశంలో కరోనా రికవరీ రేటు 96.9 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 98.85 శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 90,55,741 కరోనా టెస్టులు నిర్వహించామని ప్రభుత్వం వెల్లడించింది.

- Advertisement -