24 గంటల్లో 1286 కరోనా కేసులు…

161
corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70 వేలకు చేరువయ్యాయి. రోజుకు వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా గత 24 గంటల్లో 1286 కొత్త కేసులు నమోదుకాగా 12 మంది మృతిచెందారు.

దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 68946కి చేరింది. 18708 యాక్టివ్ కేసులు ఉండగా 49675 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక కరోనాతో రాష్ట్రంలో ఇప్పటివరకు 563 మంది మృత్యువాతపడ్డారు.

జిల్లాల వారీగా 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే జీహెచ్ఎంసి లో 391, గద్వాల్ లో 55, కరీంనగర్ 101, మేడ్చల్ లో 72, నిజామాబాద్ లో 59, రంగారెడ్డి 121, వరంగల్ అర్బన్ లో 63 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -