రాష్ట్రంలో 24 గంటల్లో 1097 కరోనా కేసులు…

115
corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 66 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 921 పాజిటివ్ కేసులు నమోదు కాగా నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 2,65,049కు చేరుకున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 11,047 యాక్టివ్ కేసులుండగా 2,52,565 మంది కరోనా నుండి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 1,437 మంది మృతిచెందారు.దేశంలో కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.54 శాతంగా ఉంది. రాష్ట్రంలో 95.28 శాతానికి రికవరీ రేటు పెరిగింది తెలిపింది వైద్య ఆరోగ్య శాఖ.

గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 42,740 కరోనా టెస్ట్‌లు చేయగా ఇప్పటి వరకు 52,01,214 టెస్టులు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.

- Advertisement -