24 గంటల్లో 1931 కరోనా కేసులు..

164
coronavirus
- Advertisement -

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86 వేలు దాటాయి. గత 24గంటల్లో 1,931 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 11 మంది మృత్యువాతపడ్డారు.

ఇక తెలంగాణలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86,475కి చేరగా 665 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,736 యాక్టివ్‌ కేసులుండగా 63,074 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో 298 కేసులు నమోదుకాగా వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 144, రంగారెడ్డి 124, కరీంనగర్‌లో 89, సంగారెడ్డి 86, నల్గొండ 84లో కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 72.93 శాతం కాగా, ఇది దేశ సగటు (70.37)కంటే ఎక్కువని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.24 గంటల్లో 23,303 పరీక్షలు చేయగా మొత్తం 6,89,150 పరీక్షలు చేసినట్లు పేర్కొంది.

- Advertisement -