రాష్ట్రంలో 2 లక్షల 50 వేలు దాటిన కరోనా కేసులు..

145
coronavirus
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 50 వేలు దాటాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1,440 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 5గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,50,331కు చేరాయి.

ఇప్పటివరకు కరోనాతో 1377 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19,890 యాక్టివ్ కేసులుండగా 17,135 హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కరోనా మరణాల శాతం దేశవ్యాప్తంగా 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.55 శాతానికి తగ్గింది.

దేశంలో కరోనా రికవరీ రేటు 92.4 శాతంగా ఉంటే రాష్ట్రంలో 91.50 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 42,673 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటివరకు 46,18,470 టెస్టులు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -