రాష్ట్రంలో 24 గంటల్లో 948 కరోనా కేసులు..

194
telangana corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 948 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 223059కి చేరుకోగా 24 గంటల్లో 1,896 మంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,098 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

కరోనా నుండి 2,00686 మంది కోలుకోగా ఇప్పటివరకు కరోనాతో 1,275 మంది మృతిచెందారు.. ఇక, దేశవ్యాప్తంగాకరోనా మృతుల సంఖ్య 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.57 శాతానికి తగ్గిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 89.96 శాతంగా ఉండగా గత 24 గంటల్లో 26,027 టెస్ట్‌లు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -