టీ కాంగ్రెస్‌ ఖతం.. టీఆర్ఎస్‌లోకి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు

257
trs
- Advertisement -

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ సీఎల్పీ విలీనానికి సర్వం సిద్ధమయింది. శాసనసభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర టీఆర్ఎస్‌లో చేరారు. తాజాగా మరో ముగ్గురు శాసనసభ్యుల నుంచి అధికార పార్టీకి సంకేతాలు అందాయి. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణారెడ్డి, పొడెం వీరయ్య, జగ్గారెడ్డి కారెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దీనివల్ల అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతమున్న ప్రతిపక్ష హోదాను కోల్పోనుంది. ఈ నేపథ్యంలో 13 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన విలీనం లేఖను స్పీకర్‌కు అందజేసేందుకు టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. జూన్ మొదటివారంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆలోపే ఈ ప్రక్రియను పూర్తిచేయాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Telangana Congress MLAs

- Advertisement -