- Advertisement -
పీసీసీ చీఫ్ రేవంత్ తీసుకుంటున్న ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ ఈ నెల 22న సమావేశం కానున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు. ఈ భేటీకి రావాలంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని.. ఇంటికి వెళ్లి మరీ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆహ్వానించారు. అలాగే సీనియర్ నేతలు జగ్గారెడ్డి, శ్రీధర్బాబు, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి సహా పలువురు సీనియర్ నేతలకు ఆహ్వానాలు అందాయి.
గత కొంతకాలంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్న నేతలు రహాస్య భేటీలు నిర్వహిస్తున్నారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే మరికొంతమంది నేతలు అసంతృప్త నేతలను బుజ్జగించే ప్రయత్నం చేసినా ఎలాంటి ఫలితం లేకపోయింది.
దీంతో ఈ నెల 22న జరిగే భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
- Advertisement -