ఓట‌మిపాలైన కాంగ్రెస్ దిగ్గ‌జాలు..

222
jana komati dk
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ సెంచ‌రీకి చేరువ‌లో ఉంది. కారు జోరుకు మహాకూట‌మి నేత‌లు కుప్ప‌కూలిపోయారు. కాంగ్రెస్ లో సీనియ‌ర్ నేత‌లు కూడా ఓట‌మిపాల‌య్యారు. వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర‌కాల నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్ధి కొండా సురేఖ, టీఆర్ఎస్ అభ్య‌ర్ధి చ‌ల్లా ధ‌ర్మారెడ్డి చేతిలో ఓట‌మిపాల‌య్యారు. అలాగే మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు జానారెడ్డి, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేత నోముల నర్సింహయ్య చేతిలో 9,516 ఓట్ల తేడాతో జనారెడ్డి ఓడిపోయారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్య‌ర్ధి స‌ర్వే సత్య‌నారాయ‌ణ‌, గ‌ద్వాల నుంచి మాజీ మంత్రి డీకే అరుణ పలువురు సీనియ‌ర్ నేత‌లు ఓడిపోయారు. న‌ల్ల‌గొండ‌లో మాజీ మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి పై, టీఆర్ఎస్ అభ్య‌ర్ధి కంచ‌ర్ల భూపాల్ రెడ్డి ఘ‌న విజ‌యం సాధించారు.

- Advertisement -