సీఎం కేసీఆర్‌కు అరుదైన అవకాశం..

488
kcr trump
- Advertisement -

సీఎం కేసీఆర్‌కు అరుదైన అవకాశం దక్కింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గౌరవార్ధం ఇచ్చే విందులో పాల్గొనాలని సీఎం కేసీఆర్‌కు రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందింది. ఈ నెల 25న రాష్ట్రపతి భవన్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు రాష్ట్రపతి విందు ఇవ్వనున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ సహా కొద్దిమంది కేంద్రమంత్రులకే రాష్ట్రపతి ఆహ్వానం అందింది. వీరితో పాటు అసోం,హర్యానా,కర్ణాటక,బీహార్,మహారాష్ట్ర,తమిళనాడు,ఒడిశా,తెలంగాణ సీఎంలకు మాత్రమే రాష్ట్రపతి భవన్‌ నుంచి ఆహ్వానం అందింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఈ నెల 25న సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు.

భారత పర్యటనలో భాగంగా సర్ధార్ పటేల్ స్టేడియం (మోతేరా క్రికెట్ స్టేడియం)ను ప్రారంభించనున్నారు ట్రంప్‌. ఇది ప్రపంచంలోనే అత్యంత విశాలమైన క్రికెట్ స్టేడియం. ఇందులో ఒకేసారి 110000 మంది ప్రజలు మ్యాచ్ ను వీక్షించవచ్చు. ఈ స్టేడియం ఆవిష్కరణ కార్యక్రమానికి వేలాది సంఖ్యలో ప్రజలు తరలిరానున్నట్లు భావిస్తున్నారు.

- Advertisement -