ముస్లిం సోదరులకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు..

137
kcr
- Advertisement -

అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో సమర్పించే చాదర్ (గిలాఫ్) ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇవాళ సంప్రదాయబద్ధంగా సాగనంపారు. దర్గాలో సమర్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన చాదర్‌ను ముస్లిం మత పెద్దలు సీఎం ముందు ప్రదర్శించారు. ఈ సందర్భంగా మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయ రంగం పురోగమించాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, సీఎం కుటుంబం సంపూర్ణ ఆరోగ్యంతో పరిపూర్ణ జీవితం గడపాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా ముస్లింలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం, ఎమ్మెల్సీలు మహ్మద్ ఫరీదుద్దీన్, ఫారూఖ్ హుస్సేన్, ఎమ్మెల్యే మహ్మద్ షకీల్, కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -