తెలంగాణ నెంబర్ 1.. సీఎం కేసీఆర్ హర్షం

59
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు, ఆదర్శవంతమైన, పారదర్శక పాలనకు మరోసారి తెలంగాణ నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సుస్థిరాభివృద్దిని సాధిస్తూ, దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం స్వచ్ఛ భారత్‌ సర్వేక్షణ్‌లో మరోసారి దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. సమిష్టి కృషితో పల్లె ప్రగతిని సాధిస్తూ, పచ్చని తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం పునరుద్ఘాటించారు. గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్‌ కింద పలు విభాగాల్లో తెలంగాణ రాష్ట్రం 13 అవార్డులు దక్కించుకుని, దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం పట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

పల్లె ప్రగతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును, ఆ శాఖ ఉన్నతాధికారులను, సిబ్బందిని, సర్పంచులను, ఎంపీటీసీలను, గ్రామ కార్యదర్శులను సీఎం కేసిఆర్ అభినందించారు. అప్రతిహత ప్రగతితో ముందుకుసాగుతున్న తెలంగాణ రాష్ట్రం, దేశ ప్రగతిలో తన వంతుగా గుణాత్మక భాగస్వామ్యం పంచుకోవడం ప్రతీ తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన సందర్భం. ఇదే పరంపరను కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -