20న కేబినెట్ సమావేశం..

3
- Advertisement -

తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు జరగనుంది. హైదరాబాద్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

స్వాతంత్ర్య సమర యోధుడు, సామాజిక సంస్కర్త, రాజనీతిజ్ఞుడు, హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి నివాళులు అర్పించారు. నిస్వార్థ నాయకుడిగా, తెలంగాణ గడ్డపై ప్రజలు ఎన్నుకున్న తొలి ముఖ్యమంత్రిగా విశేష సేవలు అందించిన మహావ్యక్తి బూర్గుల గారు అని, విలువలతో కూడిన వారి జీవితం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని తన సందేశంలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Also Read:Revanth Reddy:ఇండోర్ తరహాలో హైదరాబాద్ అభివృద్ధి

- Advertisement -