11న తెలంగాణ కేబినెట్ భేటీ

21
- Advertisement -

ఈ నెల 11న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 9:30 కి సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ జరగనున్నట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ధరణి పోర్టల్‌లో మార్పులకు సంబంధించి చర్చతో పాటు రైతు బంధుపై చర్చించే ఛాన్స్ ఉంది. పడావ్ ఉన్న భూములకు సంబంధించి రైతు బంధు వేయాలా వద్దా అన్న దానిపై చర్చించనున్నారు. అలాగే కీలకమైన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొత్త వారి పేర్లను ప్రతిపాదిస్తారా లేదా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన దాసోజు శ్రావణ్, సత్యానారయణ పేర్లనే ఫైనల్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

Also Read:కలి..షూటింగ్ పూర్తి

- Advertisement -