తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే..

30
- Advertisement -

తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పార్టీలకు అతీతంగా పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని,22,500 కోట్ల రూపాయలతో 4,50,000 ఇండ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని అలాగే 16 కార్పొరేషన్లు ఏర్పాటుకు అమోదం తెలిపిందన్నారు. మహిళ సంఘాలు చేసిన వస్తువుల బ్రాండింగ్ కోసం ORR చుట్టూ 30 ఎకరాల స్థలం కేటాయింపు చేయాలని …గత ప్రభుత్వంలో జరిగిన ఇరిగేషన్ అవకతవకలపై విచారణ కోసం జస్టిస్ పినాకిని చంద్ర ఘోష్ తో కమిటీ ఏర్పాటు చేశామని…వంద రోజుల్లో ఇరిగేషన్ పై విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రెండు రోజుల్లో 93 శాతం రైతు బంధు ఇస్తామన్నారు.

16 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ముదిరాజ్, యాదవ కుర్మ, లింగాయత్, పద్మశాలి, పెరక, బలిజ కార్పొరేషన్ల ఏర్పాటు చేయాలని అలాగే రెడ్డి, వైశ్య, మాదిగ, మాదిగ ఉపకులాల, మాల, మల ఉపకులాల కార్పొరేషన్ల ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఏకలవ్య, బంజారా, ఆదివాసీ ల కోసం ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు చేస్తామన్నారు. గీత కార్మికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు.

2008 డీఏస్సీ అభ్యర్థులకు మినిమం పే స్కేల్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. వేసవిలో తాగునీటి కోసం ఇబ్బంది లేకుండా జాగ్రత్త తీసుకోవాలని అధికారులను ఆదేశించింది కేబినెట్. మహిళా సాధికారత కోసం 15 అంశాలతో ప్రత్యేక కార్యక్రమం కోసం నిర్ణయం తీసుకున్నామన్నారు.

ముఖ్యమంత్రి, మంత్రులందరం ఒక టీమ్ గా పని చేస్తున్నాం అన్నారు కోమటిరెడ్డి. మేం ఎన్నికల కోసం నిర్ణయాలు తీసుకోవడం లేదు… ప్రజల కోసం నిర్ణయాలు తీసుకుంటున్నాం అన్నారు. వంద రోజుల లోపే చెప్పినవి చేస్తున్నాం…బావబామ్మర్దులు నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలన్నారు. ఇకనైనా ప్రతిపక్ష పాత్ర పోషించాలి..రోజూ పిచ్చివాగుడు వాగోద్దు అన్నారు. ఆర్థిక క్రమశిక్షణతో ఉంటాం అన్నారు.

Also Read:పురందేశ్వరి పోటీపై సస్పెన్స్?

- Advertisement -