తెలంగాణలో కరోనా అప్‌డేట్‌..

40
- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీ తగ్గుముఖం పట్టాయి. ఇక తెలంగాణలో రాష్ట్రంలో కూడా ఈ మహమ్మారి తగ్గింది. 24 గంటల్లో 16,580 శాంపిల్స్ పరీక్షించగా, 24 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అదే సమయంలో 40 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు.

రాష్ట్రంలో ఇప్పటిదాకా 7,91,485 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,87,142 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య మరింత తగ్గింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 232 కరోనా యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. అటు, రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 4,111 మంది మరణించారు.

కొత్తగా వెల్లడైన కేసులలో అత్యధికంగా హైదరాబాద్‌లో 14 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 2, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, మహబూబ్ నగర్, మంచిర్యాల, నిర్మల్, మేడ్చల్ మల్కాజిగిరి, హనుమకొండ జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున వెల్లడయ్యాయి.

- Advertisement -