తెలుగు రాష్ట్రాల్లో పలు ఎమ్మెల్సీ స్ధానాలకు షెడ్యూల్ రిలీజ్ అయింది. తెలంగాణలో రెండు స్థానాలు ఒక టీచర్, స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ,ఏపీలో 8 స్థానిక సంస్థల నియోజకవర్గాలకు, 3 గ్రాడ్యుయేట్ స్థానాలకు, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 16వ తేదీన నోటిఫికేషన్ను విడుదల చేయనున్నారు. ఈనెల 23వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం కల్పించారు. మార్చి 13వ తేదీన ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
హైదరాబాద్ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసింది. సయ్యద్ అస్సాన్ జాఫ్రి ఎమ్మెల్సీ పదవి కాలం ముగియనున్న నేపథ్యంలో షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 16వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనుండగా మార్చి 13వ తేదీన పొలింగ్ ,16వ తేదీన ఎన్నిక ఫలితాన్ని వెల్లడించనున్నారు.
ఇవి కూడా చదవండి..