మంత్రి ఈటెల రాజెందర్ ను కలిసిన తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు

281
etela
- Advertisement -

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజెందర్ ను కలిశారు డాక్టర్స్ అసోసొయేషన్ సభ్యులు. . ఈసందర్భంగా ఉస్మానియా హాస్పిటల్ జనరల్ సర్జన్ రమేష్ మాట్లాడుతూ..జూనియర్ డాక్టర్లు రాజకీయ భవిష్యత్ కోసమే ఆందోళన చేస్తున్నారన్నారు. జూనియర్ డాక్టర్ల సమస్యలు తీర్చేందుకు మేం సిద్దంగా ఉన్నామని తెలిపారు.

వయోపరిమితి వారికి సంబంధంలేని అంశం అన్నారు.1200పోస్టులో.. 600ల మంది కూడా పోస్టింగ్ తీసుకోలేదన్నారు. వైద్య విధాన పరిషత్ జీవో ప్రకారమే పొస్టింగ్ ఇస్తున్నామని చెప్పారు. ఉదయం 9 నుండి సాయంత్రం4గంటల వరకూ ఆసుపత్రిలో పనిచేసి ఆ తర్వాత ప్రైవేట్ క్లినిక్ లలో పనిచేసుకోవచ్చన్నారు. కొంతమంది తమ సొంత లాభాల కోసం జూనియర్ డాక్టర్లను రెచ్చగొడుతున్నారని తెలిపారు.

- Advertisement -