రేవంత్‌రెడ్డిపై కోర్టుకు వెళ్తాం: శివాజీ

459
shivaji
- Advertisement -

సీఎండీ ప్రభాకర్‌ రావుపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని చెప్పారు తెలంగాణ విద్యుత్ ఇంజినీర్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు శివాజీ.

గత 15 రోజులుగా విద్యుత్ సంస్థలపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని గమనిస్తున్నాం…రాజకీయ పార్టీల నాయకులు వాళ్ళ పరిధిని దాటి ఒక్క సిఎండి ని కాల్చి చంపాలి అని అనడం బాధ కల్గించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలకు సేవ చేసే నాయకులు ఇలా మాట్లాడడం విడ్డూరం…మీరు కాల్చడం కాదు మేమే 70 వేల మంది తల్చుకుంటే మీరు ఏక్కడ ఉంటారు.. కాల్చడం కాదు కనీసం మీ ఇంటికి విద్యుత్ కట్ చేస్తే ఎక్కడ ఉంటారని ప్రశ్నించారు శివాజీ.

ఎండ వాన అనకుండా 24 గంటల విద్యుత్ అందిస్తున్న మా ఉద్యుగులను కించపరిస్తే ఉరుకునేది లేదని…. 33 జిల్లా ల నుండి పోన్ వస్తున్నాయి మీకు అండగా ఉంటాం అని అందరు చెబుతున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై సీఎండీతో చర్చించి పోలీసులకు ఫిర్యాదు చేస్తాం అవసరం అయితే కోర్టులో కేసు వేస్తామని చెప్పారు శివాజీ.

- Advertisement -