‘శ్యామ్ సింగ రాయ్’ కోసం సిరివెన్నెల..ఆఖరి పాట

136
shyam
- Advertisement -

న్యాచులర్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ నుంచి వస్తున్న ప్రతీ ఒక్క అప్డేట్ సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.1గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి.

డిసెంబర్ 7న సిరివెన్నెల రాసిన పాటను చిత్రయూనిట్ విడుదల చేయబోతోంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చివరి పాట కావడంతో ఈ పాట ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ పాటకు ఎంత ప్రాముఖ్యత ఉందో నాని, రాహుల్ సంకృత్యాన్ వీడియో సందేశం ద్వారా తెలియజేశారు.

రాహుల్ సంకృత్యాన్ మాట్లాడుతూ.. ‘నవంబర్ 3న సిరివెన్నెలగారు కాల్ చేశారు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో పాటను పూర్తి చేయలేకపోతోన్నాను అని అన్నారు. ఎలాగైనా సరే పాటను పూర్తి చేయండని మేం ఎంతో రిక్వెస్ట్ చేశాం. ఆ తెల్లారే ఆయన ఫోన్ చేసి మమ్మల్ని నిద్రలేపారు. ఆ రోజు దీపావళి. పల్లవి చెబుతాను రాసుకోండి అని అన్నారు. మహాభారతం బుక్‌పైన ఆరులైన్లు రాశాను.. అందులోని ఓ లైన్‌లో సిరివెన్నెల అని ఉంది. ఆయన నవ్వుతూ ఇదే నా చివరి పాట అవుతుందేమోనని అన్నారు. విధి అంటే ఇదేనేమో. ఆయన అంత్యక్రియలు జరిగిన రోజే ఆ పాటను రికార్డ్ చేశాం’ అని అన్నారు.

నాని మాట్లాడుతూ.. ‘సిరివెన్నెల అనే పాట ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే లెజెండ్ సిరివెన్నెల రాసిన చివరి పాట అది. ఆయన మరోపాటను కూడా రాశారు. దాన్ని త్వరలోనే రిలీజ్ చేస్తాం. శ్యామ్ సింగ రాయ్ సినిమాను సిరివెన్నెల గారికి అంకితం ఇస్తున్నాం’ అని అన్నారు.

‘సిరివెన్నెల’ పాటకు మిక్కీ జే మేయర్ క్లాస్ ట్యూన్ ఇచ్చారు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. సాంగ్ ప్రోమోను విడుదల చేస్తున్నాం. పూర్తి పాట కావాలంటే మరో మూడు రోజులు ఎదురుచూడాల్సిందే అని నిర్మాత అన్నారు.

సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు. మెలోడి స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుండగా.. జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

జాతీయ అవార్డు గ్రహీత కృతి మహేష్, ప్రతిభా వంతుడైన యశ్ మాస్టర్ ఈ చిత్రంలోని పాటలకు కొరియోగ్రఫర్లుగా పని చేస్తున్నారు.రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం వంటి వారు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రం దక్షిణాది అన్ని భాషల్లో డిసెంబర్ 24న విడుదల కానుంది.

నటీనటులు : నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం, జిషు సేన్ గుప్తా, లీలా సామ్సన్, మనీష్ వద్వా, బరున్ చందా తదితరులు

సాంకేతిక బృందం
దర్శకత్వం : రాహుల్ సంకృత్యాన్
నిర్మాత : వెంకట్ బోయనపల్లి
బ్యానర్ : నిహారిక ఎంటర్టైన్మెంట్
కథ : సత్యదేవ్ జంగా
సంగీతం : మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫర్ : సాను జాన్ వర్గీస్
ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎస్ వెంకట రత్నం (వెంకట్)
ఎడిటర్ : నవీన్ నూలి
ఫైట్స్ : రవి వర్మ
కొరియోగ్రఫీ : కృతి మహేష్, యశ్ మాస్టర్
పీఆర్వో : వంశీ-శేఖర్

- Advertisement -