- Advertisement -
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్పై భారత్ విజయం సాధించింది. విండీస్ విధించిన టార్గెట్ను 3 వికెట్లు కొల్పోయి 124 పరుగులు చేసి చేధించింది. ఈ విజయంతో 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది భారత్.
కేఎల్ రాహుల్ 58 పరుగులు చేయగా సాయి సుదర్శన్ 39, గిల్ 13, ధృవ్ జురేల్ 6 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు.
భారత్ తొలి ఇన్నింగ్స్:518/5 డిక్లేర్
విండీస్ తొలి ఇన్నింగ్స్:248
విండీస్ రెండో ఇన్నింగ్స్:390
భారత్ రెండో ఇన్నింగ్స్:124/3
Also Read:నిధులన్ని ఖమ్మంకేనా?:కాంగ్రెస్ ఎమ్మెల్యే
- Advertisement -

