న్యూయార్క్‌లో టీమిండియా ఆటగాళ్లు

44
- Advertisement -

టీ20 వరల్డ్ కప్‌ జూన్ 1 నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్, అమెరికా వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుండగా న్యూ యార్క్‌ చేరుకున్నారు టీమిండియా ఆటగాళ్లు. హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తోపాటు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, రిషభ్‌ పంత్‌, శివం దూబే, కుల్దీప్‌ యాదవ్‌, సిరాజ్‌లు న్యూయార్క్‌ చేరుకున్నారు.

19 మందితో కూడిన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్‌ శర్మ కెప్టెన్‌ కాగా, హార్దిక్‌ పాండ్యను వైస్‌ కెప్టెన్‌గా నియమించారు.

భార‌త స్క్వాడ్ : రోహిత్ శ‌ర్మ(కెప్టెన్), య‌శ‌స్వీ జైస్వాల్, సూర్యకుమార్ యాద‌వ్, విరాట్ కోహ్లీ, రిష‌భ్ పంత్(వికెట్ కీప‌ర్), సంజూ శాంస‌న్(వికెట్ కీప‌ర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, ర‌వీంద్ర జ‌డేజా, అక్ష‌ర్ ప‌టేల్, కుల్దీప్ యాద‌వ్, య‌జ్వేంద్ర చాహ‌ల్, అర్ష్‌దీప్ సింగ్, జ‌స్ప్రీత్ బుమ్రా, సిరాజ్‌.

రిజర్వ్ ప్లేయర్ల:శుభ్‌మ‌న్ గిల్, రింకూ సింగ్, ఖ‌లీల్ అహ్మద్, అర్షద్ ఖాన్‌లు రిజర్వ ప్లేయ‌ర్లుగా ఎంపిక‌య్యారు.

Also Read:నేటి ముఖ్యమైన వార్తలు..

- Advertisement -