2వ వన్డే: భారత్‌ టార్గెట్ 276 పరుగులు..

176
Team India
- Advertisement -

కొలంబోలో ఈ రోజు జరుగుతున్న భారత్‌- శ్రీలంక రెండో వన్డేలో లంక భారీ స్కోరు సాధించింది. ఈమ్యాచ్‌లో టాస్ గెలిచిన లంక ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు నమోదు చేసింది. ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండో (50), చరిత్ అసలంక (65) అర్ధసెంచరీలతో రాణించారు. చివర్లో చమీర కరుణరత్నే 33 బంతుల్లోనే 44 పరుగులు సాధించడంతో లంక భారీ స్కోరు నమోదు చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో యజువేంద్ర చహల్ 3, భువనేశ్వర్ కుమార్ 3, దీపక్ చహర్ 2 వికెట్లు తీశారు.

- Advertisement -