ఇండోర్ టీ20లో భారత్ ఓటమి

194
india
- Advertisement -

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత్ ఓటమి పాలైంది. దక్షిణాఫ్రికా విధించిన 228 పరుగుల లక్ష్యచేధనలో 19.3 ఓవర్లలో 178 పరుగులకే ఆలౌటైంది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. ప్టెన్ రోహిత్ శర్మ (0) డకౌటవగా,శ్రేయాస్ అయ్యర్ (1), సూర్యకుమార్ యాదవ్ (8) సింగిల్ డిజిట్ స్కోరుకే ఔటైపోయారు. రిషబ్ పంత్ (27: 14 బంతుల్లో 3×4, 2×6) ,దినేశ్ కార్తీక్ (46: 21 బంతుల్లో 4×4, 4×6) రాణించారు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కొల్పోయి 227 పరుగులు చేసింది. రిలీ రొసౌ (100 నాటౌట్: 48 బంతుల్లో 7×4, 8×6) మెరుపు సెంచరీ నమోదు చేశాడు. అతనితో పాటు డికాక్ (68: 43 బంతుల్లో 6×4, 4×6), డేవిడ్ మిల్లర్ (19 నాటౌట్: 5 బంతుల్లో 3×6) పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌తో మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో టీమిండియా చేజిక్కించుకుంది.

- Advertisement -