అభిషేక్ సునామీ..టీమిండియా ఘన విజయం

1
- Advertisement -

ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత్ విధించిన 248 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 10.3 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌ 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్‌తో భారీ స్కోరు సాధించింది. 37 బంతుల్లోనే సెంచరీ చేశాడు. అభిషేక్‌శర్మ 54 బంతుల్లో 135, 7ఫోర్లు, 13సిక్స్‌లు ఇంగ్లండ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. శివమ్‌దూబే(30), తిలక్‌వర్మ(24) ఆకట్టుకోగా భారీ స్కోరు సాధించింది భారత్‌. రు.

సూపర్‌ సెంచరీతో అదరగొట్టిన అభిషేక్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ , 14 వికెట్లు పడగొట్టిన వరుణ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ దక్కాయి. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది.

Also Read:తెలంగాణకు కేంద్రం ఇచ్చంది గుండు సున్నా!

- Advertisement -