Ind Vs NZ: టీమిండియా 46 పరుగులకే ఆలౌట్

2
- Advertisement -

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. తొలి రోజు వర్షం కారణంగా ఆట రద్దు కాగా రెండో రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది రోహిత్ సేన.

అయితే రోహిత్ తీసుకున్న నిర్ణయం తప్పని తేలడానికి ఎక్కువ సమయం పట్టలేదు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అంతా ఒక్కొక్కరుగా పెవిలియన్ బాటపట్టారు. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి 5గురు భారత బ్యాట్స్‌మెన్‌లు డకౌట్ అయ్యారు. పంత్ 20,జైస్వాల్ 13 పరుగులు చేయగా మిగితా బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథి 1,హెన్రీ 5,విలియం 4 వికెట్లు తీశారు.

Also Read:TTD:19న శ్రీ‌వారి ఆర్జితసేవా ఆన్లైన్ టికెట్లు రిలీజ్

- Advertisement -