- Advertisement -
ఏపీ శాసనమండలిలో టీ, కాఫీల రగడపై వాడివేడి చర్చ జరిగింది. మండలిలో కాఫీకి, అసెంబ్లీలో కాఫీకి తేడా చూపిస్తున్నారన్న వైసీపీ సభ్యులు ఆరోపించారు. ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని వైయస్ఆర్సీపీ సభ్యుల ఆవేదన వ్యక్తం చేశారు.
మండలిలో అధికారుల తీరును వైసీపీ తప్పుబట్టింది. అధికార సభ్యులతో ఒకలా, ప్రతిపక్ష సభ్యులతో మరోలా ప్రవర్తిస్తున్నారని వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు.
పునరావృతం కాకుండా చూస్తామని శాసనసభ వ్యవహారాల మంత్రి హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటాం అని… శాసనమండలి ఛైర్మన్ ను అగౌరవపరిచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు అన్నారు.
Also Read:కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు రిలీజ్
- Advertisement -

