షో చేసే వాళ్లు కాదు ..పని చేసే వాళ్లు కావాలిః ఎంపీ కేశినేని నాని

397
Kesineni nani.jpeg
- Advertisement -

విజయవాడ ఎంపీ కేశినేని నాని గత కొద్ది కాలంగా సోషల్ మీడియా వేదికగా పలువురిపై కామెంట్లు చేస్తున్నారు. గతంలో పార్టీ అధినేత చంద్రబాబుపై కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన చేసిన కామెంట్ వివాదస్పందంగా మారింది. సొంత పార్టీ నేతలపైనే ఆయన కామెంట్లు చేయడం పట్ల టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

తెలుగుదేశం పార్టీకి ఇప్పడు కావాల్సింది విషయం ఉన్నోళ్లు కానీ.. షో చేసే వాళ్ళు కాదని ఆయన సెటైర్లు వేశారు. కాగా లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రకటించిన పార్లమెంటరీ పార్టీ పదవులపై అసంతృప్తి వ్యక్తం చేసిన నాని.. చంద్రబాబు తీరుపై విమర్శలు చేశారు. అలాగే పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై వెరైటీగా స్పందించారు.

చంద్రబాబు ప్రకటించిన పార్లమెంటరీ పార్టీ పదవులపై విజయవాడ ఎంపీ కేశినేని నాని అలక వహించి గతంలో ఫేస్‌బుక్‌లో వెటకారంగా పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై చంద్రబాబును ఉద్దేశించి చంద్రబాబు వైఎస్సార్‌సీపీలోకి వెళితే తాను బీజేపీలో చేరతానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -