టీఆర్ఎస్‌లోకి టీడీపీ ఎమ్మెల్యేలు..!

462
sandra venkata veeraiah
- Advertisement -

తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్‌ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కారెక్కగా వారి బాటలో మరికొంతమంది ఎమ్మెల్యేలు నడిచేందుకు కార్యచరణ సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు టీడీపీ నుండి గులాబీ గూటికి చేరేందుకు ఆపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో పాటు అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు వీరిద్దరు సమావేశమై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సత్తుపల్లిలో శుక్రవారం నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో రెండు గంటలకుపైగా సండ్ర అంతర్గత సమావేశం నిర్వహించారు. ముఖ్య నేతల మనోభావాలను అడిగి
తెలుసుకున్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ మారడం సమంజసమేనని వారు అభిప్రాయపడ్డట్లు తెలిసింది. సండ్ర వెంకటవీరయ్యతో పార్టీ మారే అంశంపై చర్చించినట్లు నాగేశ్వరరావు తెలిపారు. జిల్లాకు చెందిన టీఆర్ఎస్‌ ముఖ్య నేతలు సైతం వీరికి ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. అన్నిఅనుకున్నట్లు జరిగితే త్వరలోనే వీరు కారెక్కడం ఖాయం.

- Advertisement -