బీజేపీలోకి వల్లభనేని వంశీ..?

492
vallabaneni vamshi
- Advertisement -

ఏపీలో టీడీపీకి మరో షాక్ తగలనుందా..?ఆ పార్టీ సీనియర్ నేత,గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ టీడీపీని వీడనున్నారా అంటే అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో వంశీ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి చెందిన స్వర్ణ భారతి ట్రస్ట్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మాణిక్యాలరావుతో పాటు వల్లభనేని వంశీ కూడా హాజరయ్యారు.

కార్యక్రమం పూర్తైన తర్వాత కిషన్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు వంశీ. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరిక అంశం వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరి భేటీ తర్వాత వంశీ పార్టీ మారనున్నారనే వార్త స్ధానికంగా చర్చనీయాంశంగా మారింది.

దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది టీడీపీ నేతల వల్లే తాను తక్కువ మెజార్టీతో గెలుపొందానని భావిస్తున్న వంశీ పార్టీ మారడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలకు బలం చేకూరేలా బీజేపీ నేతలు త్వరలో టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారని స్టేట్ మెంట్స్‌ ఇస్తుండటంతో రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -