మచిలీపట్నం గొడవపై కూటమి నేతలు

2
- Advertisement -

కృష్ణా జిల్లా మచిలీపట్నం పరాసుపేటలో వినాయక చవితి బ్యానర్ వివాదానికి కూటమి నేతలకు ఎలాంటి సంబంధం లేదని కూటమి నేతలు వెల్లడించారు. కూటమి నేతలు కొట్టుకున్నారని, టీడీపీ కూటమిలో వర్గపోరు మొదలైందని బ్లూ మీడియా, వైసీపీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని తెలిపారు.

కార్యకర్తల వ్యక్తిగత గొడవలను కూటమి నేతలకు ఆపాదించి వైసీపీ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీ గొడవపై రాద్దాంతం హైకమాండ్ వరకు వెళ్లడంతో దీనిపై వివరణ ఇచ్చారు.

బ్యానర్‌లో తమ పేరు లేదని జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీని చించేయగా వారిపై దాడికి పాల్పడ్డారు టీడీపీ నేతలు. అంతేగాదు తమ కాళ్లు మొక్కించుకుని మరి క్షమాపణ చెప్పించుకున్నారు. ఈ వివాదం కాస్త రచ్చకెక్కడంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా మీడియాకు వివరణ ఇచ్చారు కూటమి నేతలు.

Also Read:తెరపైకి మళ్లీ కేబినెట్ విస్తరణ..16న ఢిల్లీకి సీఎం!

- Advertisement -