ఎన్డీయేలోకి టీడీపీ..పొత్తు ఖరారు!

23
- Advertisement -

ఎట్టకేలకు ఎన్డీయేలోకి టీడీపీ చేరడం ఖరారైంది. హస్తిన పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీచేయాలనే దానిపై క్లారిటీకి వచ్చారు.

బీజేపీ, జనసేనకు 30 అసెంబ్లీ, ఎనిమిది పార్లమెంట్ స్థానాలను ఇవ్వనన్నట్లు చంద్రబాబు తెలిపినట్లు సమాచారం. ఇందులో బీజేపీకి ఆరు ఎంపీ ,ఆరు అసెంబ్లీ స్థానాలు దక్కనుండగా జనసేనకు 24 అసెంబ్లీ,2 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. పవన్ ఎంపీ స్థానంతో పాటు ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. జనసేనకు కాకినాడ, మచిలీపట్నం ఎంపీ స్థానాలు దక్కినట్లు తెలుస్తోంది. మిగిలిన 17 లోక్ సభ, 145 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది.

అరకు, రాజమండ్రి, తిరుపతి, నర్సాపురం,హిందూపూర్,రాజంపేట,అనకాపల్లి పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది.

Also Read:మొబైల్ లో ఈ సీక్రెట్ కోడ్స్ తెలుసా?

- Advertisement -