టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ అంత్యక్రియలు..!

414
shiva prasad
- Advertisement -

టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ శనివారం ఆనార్యోగంతో మృతి చెందారు. ప్రజానాయకుడిగా,సినీ నటుడిగా గుర్తింపు పొందిన శివప్రసాద్.. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం ఆయన్ని చెన్నై అపోలో ఆస్పత్రిలో చేర్చారు. వెంటిలేటర్‌పై ఆయన్ని ఉంచి.. ఎంత ప్రయత్నం చేసినా డాక్టర్లు ఆయన్ని కాపాడలేకపోయారు. ఫలితంగా ట్రీట్‌మెంట్ జరుగుతుండగానే శనివారం మధ్యాహ్నం 2:10కి ఆయన కన్నుమూసినట్లు డాక్టర్లు తెలిపారు.

టీడీపీ నేత శివప్రసాద్ మరణం ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్ని విషాదంలో ముంచేసింది. ఎప్పుడూ హుషారుగా ఉండే ఆయన.. అనారోగ్యంతో కన్నుమూయడం పార్టీ వర్గాల్లో తీవ్ర కలవరం కలిగించింది. శివప్రసాద్ భౌతిక కాయాన్ని చెన్నై నుంచీ తిరుపతికి తరలించారు. భారీ కాన్వాయ్ వెంట రాగా.. శివప్రసాద్ భౌతిక కాయాన్ని శనివారం సాయంత్రం చెన్నైలోని అపోలో ఆస్పత్రి నుంచీ తీసుకువెళ్లారు.

ప్రస్తుతం తిరుపతి ఎన్జీవో కాలనీలోని శివప్రసాద్ ఇంటికి నేతలు, కార్యకర్తలు కడసారి ఆయన్ని చూసేందుకు తరలివస్తున్నారు. శివప్రసాద్ అంత్యక్రియలు సోమవారం ఆయన సొంత ఊరైన ఐతేపల్లిలో జరుగుతాయి.

- Advertisement -