తారకరత్నకు తీవ్ర అస్వస్థత

110
- Advertisement -

నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో అపశృతి నెలకొంది. కుప్పం సమీపాన ఉన్న లక్ష్మీపురం శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం లోకేష్ పాదయాత్ర స్టార్టయ్యింది. టీడీపీ కార్యకర్తలు, అభిమానుల పెద్ద ఎత్తున రావడంతో తాకిడికి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు.

ఆయనను ఆసుపత్రికి తరలించగా వైద్యులు ప్రథమ చికిత్సలో భాగంగా సీపీఆర్పిసి చేసిన వైద్యులు హార్ట్ బీట్ ను పునరుద్దరించినట్టు తెలుస్తుంది. వైద్యులు CRPC చేసి కొంత కంట్రోల్ లోకి తెచ్చినా  ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పల్స్ లేదు. ట్రీట్ మెంట్ స్టార్ట్ చేశాం. 45 నిమిషాల తరువాత పల్స్ మొదలైంది. మా ప్రయత్నం మేము చేస్తున్నామని వైద్యులు తెలిపారు.

దాదాపు 45 నిమిషాల పల్స్ లేకపోవడంతో శరీరం బ్లూ కలర్ గా మారిందని, భవిష్యత్ లో బ్రెయిన్ సంబంధింత వ్యాధి బారిన పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక మెరుగైన చికిత్స కోసం తారకరత్నను బెంగళూరుకు తరలించే అవకాశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -