మునుగోడులో పోటీ చేయడం లేదు: తమ్మినేని

97
tammineni-veerabhadram
- Advertisement -

మునుగోడులో సీపీఎం పార్టీ బరిలో ఉండటం లేదన్నారు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. భువనగిరిలో మీడియాతో మాట్లాడిన ఆయన…మునుగోడులో బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి పోరాడతామన్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతిస్తామనే అంశాన్ని త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

యాదాద్రి జిల్లాలో మొత్తం 160 చెరువులు మూసీ ద్వారా నిండుతున్నాయని, ఐదు కాలువల ద్వారా నది పారుతున్నదని చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతం విషతుల్యమయిందని తెలిపారు.

ఖమ్మం టీఆర్‌ఎస్‌ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య విషయంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని….కృష్ణయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు.

- Advertisement -