మునుగోడులో బీజేపీని బొందపెడుదాం: తమ్మినేని

59
tammineni
- Advertisement -

మునుగోడులో బీజేపీని బొందపెడుదామని సీపీఎం శ్రేణులకు పిలుపునిచ్చారు తమ్మినేని వీరభద్రం. సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో సీపీఎం మునుగోడు నియోజకవర్గ విస్తృత స్ధాయి సమావేశంలో మాట్లాడారు తమ్మినేని. టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చి టీఆర్ఎస్ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడాలని కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఉద్యమాల గడ్డపై కాషాయ జెండాలను ఎగురనివ్వం. బీజేపీని ఓడించడమే సీపీఎం లక్ష్యమని అని తేల్చిచెప్పారు. గత 8 సంత్సరాలుగా రాజ్యాంగ హక్కులు, ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తూ దేశంలో దుర్మార్గ పాలన బీజేపీ చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ సాయుధ వారోత్సవాలు, స్వాతంత్య్ర దినోత్సవ ఉత్సవాలు నిర్వహించే హక్కు బీజేపీ ప్రభుత్వానికి లేదన్నారు. రాష్ట్రాలకు ఉన్న అన్ని హక్కులను లాక్కుంటు కేంద్రం నియంతృత్వ పాలన సాగిస్తున్నది మండిడ్డారు.

దేశంలో అన్ని మతాల వారు ఎప్పటి నుంచో ఉంటున్నారు. ఇప్పుడు మైనార్టీలు ఈ దేశంలో ఉండొద్దు అని బీజేపీ వాళ్లు మత ఘర్షలను రెచ్చ గడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మత కలహాలు సృష్టించడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు.

- Advertisement -