తప్పు చేస్తే సొంతపార్టీ అయినా నిలదీస్తా:ఖుష్బూ

134
khushbu
- Advertisement -

ప్రస్తుతం దేశమంతా మోదీ గాలి వీస్తుందన్నారు సినీ నటి ఖుష్బూ. తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓ తమిళ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఖుష్బూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తప్పు జరిగితే నిలదీసే మన స్తత్వం తనదని… అది స్వంత పార్టీ అయినా వెనుకాడనని చెప్పారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీటు లభిస్తే సంతోషమేనని తెలిపారు. రాష్ట్రప్రజలు కూడా బీజేపీని ఆదరిస్తున్నారని, ఈవిషయం రాబోయే ఎన్నికల్లో స్పష్టంగా తెలుస్తుంద న్నారు. ట్రిప్లికేన్‌ నియోజకవర్గంలో తన ప్రచారం కొనసాగిస్తానని ఖుష్బూ తెలిపారు. చెన్నై దాటితే బీజేపీ కనిపించదు అనే మాటలో నిజం లేదన్నారు. ఇటీవల చేపట్టిన వేల్‌ రథయాత్ర రాష్ట్రవ్యాప్తంగా విజయ వంతమైందని గుర్తు చేశారు.

- Advertisement -