Kollywood:ఆ స్టార్లకు రెడ్ కార్డ్‌ జారీ..!

39
- Advertisement -

కోలీవుడ్‌ షూటింగ్‌ సహకరించని కోలీవుడ్ స్టార్ హీరోలపై తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి షాక్ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా ఎన్.రామసామి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొడ్యూసర్స్‌కు సహకరించని ఐదుగురు స్టార్ హీరోలను గుర్తించింది. ఈ మేరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించింది. అలాగే ఆయా నటులతో సినిమాలు చేయాలనుకుంటే ముందు తమ దృష్టికి తీసుకురావాలని నిర్మాతలకు తెలిపింది.

Also Read: కేసరిలో కాజల్‌ ఫస్ట్‌ లుక్‌

ఆ ఐదుగురు నటులకు త్వరలో నోటీసులు పంపనున్నట్టు తెలిపింది. వారి నుంచి వచ్చే సమాధానాన్ని ఆధారంగా చేసుకొని..తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. వాళ్లిచ్చే వివరణ ఆమోదయోగ్యంగా లేకపోతే రెడ్ కార్డ్‌ జారీ చేయొచ్చని సమాచారం. అయితే ఆ ఐదుగురు నటులు ఎవరనేది మాత్రం నిర్మాతల మండలి వెల్లడించలేదు. కానీ కోలీవుడ్‌లో విశాల్‌, శింబు, యోగిబాబు, ఆధర్వ, ఎస్‌.జే సూర్య అయి ఉంటారని కథనాలు ప్రచురితమవుతున్నాయి.

Also Read: ఎక్సైటింగ్ హారర్ డ్రామా: అవికా గోర్

- Advertisement -