రేపు యాదాద్రికి సీజేఐ రమణ..

121
ramana
- Advertisement -

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో తొలిసారి హైదరాబాద్‌కు విచ్చేసిన సీజేఐ ఎన్వీ రమణ రేపు యాదాద్రిలో పర్యటించనున్నారు. లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. జస్టిస్‌ ఎన్వీ రమణతోపాటు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, సీఎం కేసీఆర్‌ కూడా యాదాద్రికి వెళ్లనున్నారు. యాదాద్రీశుని దేవాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం పునఃనిర్మిస్తున్న విషయం తెలిసిందే. జస్టిస్‌ ఎన్వీ రమణ నిన్న కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

- Advertisement -