అర్జున్ రెడ్డి దర్శకుడిని మార్చేసిన నిర్మాతలు..

297
Varma movie
- Advertisement -

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం అర్జున్ రెడ్డి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈచిత్రాన్ని తెరకెక్కించారు. విజయ్ సరసన శాలిని పాండే హీరోయిన్ గా నటించింది. ఈచిత్రం భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా విజయ్ దేవరకొండ ను మంచి క్రేజ్ ను తీసుకువచ్చింది. తెలుగులో పెద్ద హిట్ సాధించిన ఈచిత్రాన్ని పలు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ లో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో షాషిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఇక తమిళంలో కూడా ఈచిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. హీరో విక్రమ్ తనయుడు ధృవ్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు.

Arjun Reddy

తమిళ్ లో వర్మ అనే టైటిల్ తో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాల దర్శకత్వంలో ఈ ఫోర్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్న ఈమూవీ ఇటివలే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈసినిమాను విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈచిత్ర నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

 E4 Entatainments

సినిమా మొత్తం అవుట్ పుట్ చూశాక అసంతృప్తి వ్యక్తం చేశారట నిర్మాతలు. మళ్లీ మొదటి నుంచి రీషూట్ చేయాలనే నిర్ణయానికి వచ్చారట. అంతేకాకుండా హీరో ధృవ్ తప్ప మిగతా సాంకేతిక నిపుణులను మొత్తం మార్చేయాలని భావిస్తున్నారట. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు చిత్ర నిర్మాతలు. సినిమా మొత్తం తీశాక మళ్లీ మొదటి నుంచి రీ షూట్ చేయడంతో ఇప్పుడు కోలీవుడ్ లో ఈనిర్ణయం హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -