తెలుగు హీరోలపై తమన్నా షాకింగ్ కామెంట్స్‌..

2499
Acterss Tamanna
- Advertisement -

మిల్యీ బ్యూటీ తమన్నా తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతోంది. త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి దాదాపు 15 ఏళ్లైపోయింది. ఇప్పటివరకు ఈ అమ్మడు 50కి పైగా చిత్రాల్లో న‌టించింది. కరోనా నేపథ్యంలో తమన్నా ప్రస్తుతం ఇంటోనే గడుపుతోంది. లాక్‌డౌన్‌ సమయంలో అభిమానులతో సోషల్‌ మీడియా లైవ్‌ చాట్‌ చేసింది. అందులో అభిమానులు అడిగిన ప్రశ్నలకు అసక్తికర సమాధానాలు చెప్పింది. ఈ సందర్భంగా టాలీవుడ్ హీరోల గురించి పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది ఈ మిల్యీ బ్యూటీ.

హీరో ప్రభాస్ ఎంతో హంబుల్. ఫీమేల్ ఫ్యాన్స్ అంటే ఆయనకు సిగ్గు అంటూ తమన్నా చెప్పుకొచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ జెంటిల్మెన్ అని.. ఆయనతో పనిచేసేటపుడు ఎంతో కంఫర్టబుల్‌గా ఉంటారు. ఆయనతో కెమెరా మెన్‌ గంగతో రాంబాబు సినిమా ఇప్పటికీ మరవలేన్నారు. అంతేకాదు తమన్నా నాకు ఓపిక ఉన్నంత వరకు నేను సినిమాలు చేస్తూనే ఉంటానని చెప్పుకొచ్చింది. మెగా ఫ్యామిలీ హీరోస్‌కి గర్వం ఉండదని.. చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’లో పనిచేయడం మరవలేనిది ఆయన చాలా సపోర్ట్ చేశారని తెలిపింది.

నేను నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. అదే నా సక్సెస్ సీక్రెట్ అని చెప్పుకొచ్చింది. మరోవైపు ఇంట్లో ఉండి ఆవకాయ పెట్టినట్టు అభిమానులకు చెప్పింది. తెలుపు మాత్రమే అందం కాదు. మంచి మనసు ఉన్న ప్రతి ఒక్కరు అందగాళ్లే అంటూ చెప్పింది. నటన విషయంలో తాను ఎక్కువ కష్టపడింది బాహుబలి. ఆ తర్వాత అభినేత్రి సినిమా కోసం కాస్త ఎక్కువగానే కష్టపడ్డట్టు తమన్నా చెప్పుకొచ్చింది.

- Advertisement -