వలస కూలీల తరలింపు..కేంద్రం తీరు సరికాదు

309
talasani srinivas
- Advertisement -

వలస కూలీల తరలింపుపై కేంద్రం తీరు సరికాదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ బన్సీలాల్ పేటలో రోడ్డు పనులను పరిశీలించిన అనంతరం మాట్లాడిన తలసాని..కేంద్ర ప్రభుత్వం సడలింపుల ప్రకటన జారీచేసి చేతులు దులుపుకోవాదం సమంజసం కాదన్నారు.

ఈ విషయంలో ప్రధానమంత్రి మోడీ వెంటనే స్పందించి వలస కార్మికుల తరలింపుకు ఉచితంగా రైళ్ళను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయా రాష్ట్రాలలో ఉన్న వలస కూలీలను గమ్య స్థానాలకు చేర్చే బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలన్నారు.

ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే బస్సులలో తరలించాలని నిర్ణయించడం సరైంది కాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీహార్, జార్ఖండ్, చత్తీస్ ఘడ్ తదితర రాష్ట్రాలకు చెందిన సుమారు 15 లక్షల మంది వలస కూలీలు ఉన్నారని చెప్పారు.

తెలంగాణ నుండి బీహార్, జార్ఖండ్, చత్తీస్ బస్సులలో వెళ్లేందుకు సుమారు 3 నుండి 5 రోజుల సమయం పడుతుందని..రైళ్ళలో ఆయా రాష్ట్రాలకు వలస కూలీలను చేర్చిన తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో బస్సుల ద్వారా స్వగ్రామాలకు తరలించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు తలసాని.

- Advertisement -