ఆశా వర్కర్ల సేవలు వెలకట్టలేనివి: తలసాని

140
talasani
- Advertisement -

ఆశావర్కర్ల సేవలు వెలకట్టలేనివన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కరోనా కష్టకాలంలో ఆశ కార్యకర్తలు ఎంతో ధైర్య సాహసాలతో పనిచేశారని కొనియాడారు. ఆశా కార్యకర్తలకు ఆదివారం మొబైల్ ఫోన్లను పంపిణీ చేసిన తలసాని.. కరోనా సమయంలో వారు చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు.

ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ కోసమే ఆశ కార్యకర్తలకు మొబైల్ ఫోన్‌లు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.ఆశా కార్యకర్తల కష్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించి వేతనాలు పెంచారని తెలిపారు.

- Advertisement -