టీన్యూస్‌-అపెక్స్‌ ఎడ్యుకేషన్ ఫెయిర్ ప్రారంభం

411
tnews fair
- Advertisement -

విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ న్యూస్ గోల్డెన్‌ ఎడ్యుకేషన్ ఫెయిర్ – 2019 ప్రారంభమైంది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి ఎడ్యుకేషన్ ఫెయిర్‌ని ప్రారంభించారు. అనంతరం స్టాళ్లను పరిశీలించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ జరగనుంది .ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరిగే ఈ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌కు ప్రవేశం ఉచితం.

ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్‌ విద్యార్థుల బంగారు భవితకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంటర్ తర్వాత సాంప్రదాయక డిగ్రీ కోర్సులు చేయాలా…లేకుంటే ఇంజనీరింగ్, మెడిసన్‌ కోర్సుల కోసం ఎమ్‌సెట్ కోచింగ్‌లకు వెళ్లాలా అన్న ప్రశ్న ఎదురువుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ ద్వారా నిపుణులు అందించే సలహాలు వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేయనున్నాయి. ప్రధానంగా ఇంజనీరింగ్, మెడిసిన్‌తో పాటు ఇతర అన్ని కోర్సులు, కెరీర్స్‌ పై విద్యార్థులకు అవగాహన కల్పించడం… ఆయా రంగాలకు చెందిన అత్యంత నిష్ణాతులు విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అందిస్తారు. అంతేగాదు ఎన్నో విద్యాసంస్థలు తమ కాలేజీల సమాచారం అందించనున్నాయి.

ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ఏ కాలేజీలో,ఏ బ్రాంచిలో సీటు వస్తుందో విద్యార్థులు మాక్ కౌన్సెలింగ్ ద్వారా అంచనాకు రావచ్చు. విద్యార్థులకు ఇంజనీరింగ్ కాలేజీ, బ్రాంచ్ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివిధ బ్రాంచ్‌లతో కెరీర్ స్కోప్‌, ఉన్నత విద్యావకాశాలు, పరిశ్రమలు కోరుకుంటున్న స్కిల్స్ గురించి విద్యారంగ నిపుణులు అవగాహన కల్పించనున్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసి సలహాలు సూచనలు ఇస్తారు.

- Advertisement -