మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రం సైరా. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని చరణ్ నిర్మిస్తుండగా అమితాబ్ బచ్చన్ తో పాటుగా సౌత్లో ఉన్న పలువురు ప్రముఖ ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం. ఈ చిత్ర ట్రైలర్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథంలో తాజాగా ఓ వార్త బయటికి వచ్చింది. ఈ చిత్ర ట్రైలర్ను సైమా అవార్డు వేడుల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఖతార్లోని దోహా వేదికగా ఆగస్ట్ నెల 15 మరియు 16 తేదీలలో సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా)వేదిక ఘనంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరు కానున్నారట. ఆ వేడుకలో చిత్ర ట్రైలర్ ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. హిందీతో పాటు సౌత్ లోని పలు భాషలలో విడుదల కానున్న సైరా మూవీ ట్రైలర్ని ఇలాంటి అంతర్జాతీయ వేదిక ద్వారా ప్రమోట్ చేయడం సినిమాకు అనుకూలించే అంశమే అని అంటున్నారు.