‘సైరా’ ట్రైలర్ వచ్చేసింది..

445
- Advertisement -

చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సైరా’. ఈ మూవీ ట్రైలర్‌ ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న చిరు అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. సైరా ట్రైలర్ రిలీజై ఇప్పుడు జాతీయ వ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృదం. ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ ఈ ట్రైలర్‌ను కట్ చేశారు.

భారతమాతా కీ జై అంటూ మొదలైంది ఈ ట్రైలర్. ఆగ్లేయులపై నరసింహారెడ్డి తిరుగుబాటు.. నరసింహా రెడ్డి ఆచూకీ కోసం ఆంగ్లేయులు అక్కడి ప్రజలను హింసించడం ఈ ట్రైలర్‌లో చూపించారు. “స్వేచ్ఛ కోసం ప్రజలు చేస్తోన్న తిరుగుబాటు.. నా భరతమాత గడ్డమీద నిలబడి హెచ్చరిస్తున్నా.. నా దేశం వదిలి వెళ్లిపోండి.. లేదా.. యుద్ధమే” అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ ఈ ట్రైలర్‌కి హైలైట్‌గా నిలిచింది. ఈ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయనే చెప్పాలి.

Sye Raa Movie

ఇటీవలే పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ తో ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదలగా, అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ‘రేనాటి వీరులారా చరిత్రలో మనం ఉండకపోవచ్చు. కానీ చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి’ అంటూ చిరూ చెప్పిన డైలాగ్ టీజర్‌లో హైలైట్ అయింది.

ఈ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. రామ్ చరణ్ ఈ చిత్రాన్ని 250 కోట్లతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార, తమన్నా, జగపతిబాబు, అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. అక్టోబర్ 2న సినిమా విడుదల కానుంది.

- Advertisement -