ముగిసిన శారదా పీఠాధిపతుల చాతుర్మాస్య దీక్ష..

525
sharada peetam
- Advertisement -

విశాఖలోని రిషికేశ్‌లో శారదా పీఠాధిపతులు చేపట్టిన చాతుర్మాస్మ దీక్ష ముగిసింది. జూలై 16న పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతితో కలిసి చాతుర్మాస్య దీక్షలో ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర పాల్గొన్నారు. – దీక్షలో భాగంగా శారదా చంద్రమౌళీశ్వరులు, రాజశ్యామల అమ్మవార్లకు విశేష పూజలు అందించారు. దీక్ష ముగియడంతో త్వరలో విశాఖకు పీఠాధిపతులు పయనం కానున్నారు.

చాతుర్మాస్య దీక్ష అంకురార్పణకు ఉత్తరాఖండ్ పురపాలక శాఖ మంత్రి హాజరయ్యారు. హైందవ సనాతన వైదిక ధర్మంలో అత్యంత విశిష్టమైంది చాతుర్మాస్య దీక్ష… గంగానదీ తీరాన 15 ఏళ్లుగా చాతుర్మాస్య దీక్షను కొనసాగిస్తున్న శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి. దీక్షను తపస్సులా భావించే స్వరూపానందేంద్రతో పాటు ఈసారి దీక్షలో ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర పాల్గొన్నారు.

- Advertisement -