సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు:స్వరూపానంద

115
swamy
- Advertisement -

యాదాద్రి నిర్మాణంపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి స్పందించారు. సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. తెలంగాణలో మత సామరస్యంతో కేసీఆర్‌ పాలన సాగుతోందన్నారు.

రాజుల కాలం తర్వాత నిర్మాణమైన అద్భుతమైన దేవాలయం యాదాద్రి అన్నారు. సనాతన ధర్మాన్ని గుర్తించి యాదాద్రిని మహాక్షేత్రంగా కేసీఆర్ తీర్చిదిద్దుతారన్నారు. కేసీఆర్‌ మైలురాళ్లలో తెలంగాణ సాధనతో పాటు యాదాద్రి నిర్మాణం కూడా చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. యాదాద్రిలో వేదిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్నారు.

- Advertisement -