మే 31న వస్తున్న “సువ‌ర్ణ‌సుంద‌రి”..

248
- Advertisement -

జ‌య‌ప్ర‌ద‌, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం సువర్ణసుందరి.సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకువస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతొందన్న క్యాప్షన్‌తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఓ సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 31న‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. హీరో ఇంద్ర పుట్టిన రోజును పురస్కరించుకొని కేక్ ను కట్ చేయించి విషేష్ ను తెలియ చేసారు. ‌

Svurana Sundari Movie

హీరో ఇంద్ర మాట్లాడుతూ.. అందరం కష్టపడ్డాం.. ఈ టీమ్‌తో మరో సినిమా చెయాలనుంది. దర్శక నిర్మాతల కష్టానికి తగ్గ ప్రతిఫలం బావుండాలని కొరుకుంటున్నానన్నారు.

హీరో రామ్ మాట్లాడుతూ.. ఈ చిత్రం విషయంలో దర్శకుడు సూర్య హార్డ్ వర్క్ హైలెట్‌గా చెప్పుకొవాలి. ఆద్యంతం గ్రిప్పింగ్ గా సినిమాను తెర మీదకు తీసుకు వచ్చారన్నారు.

హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ.. ఈ సినిమాకు అందరం చాలా ఎక్కువ హార్ట్వర్క్ చేశాము. తెరపై అది కన్పిస్తుందన్నారు.

హీరొయిన్ సాక్షి మాట్లాడుతూ .. సువర్ణ సుందరి నాకెరీర్‌లో ప్రత్యేక చిత్రం. గ్లామర్, యాక్షన్, లవ్ ,థ్రిల్ ఇలా అన్నీ అంశాలు హైలెట్‌గా దర్శకుడు సూర్య సినిమా తీశారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సాయి కార్తీక్, రామ్ సుంకర, ఎలుమహంతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -